ఎస్ ఎంబీల కోసం.. డెల్ కొత్త ల్యాప్ టాప్స్

ఎస్ ఎంబీల కోసం.. డెల్ కొత్త ల్యాప్ టాప్స్

హైదరాబాద్​, వెలుగు: డెల్ టెక్నాలజీస్ చిన్న మధ్యతరహా వ్యాపారాల కోసం రూపొందించిన  ప్రో 14 ఎసెన్షియల్, డెల్ ప్రో 15 ఎసెన్షియల్ ల్యాప్​టాప్​లను డెల్ హైదరాబాద్​లో ప్రదర్శించింది.  వీటి ధర రూ.31,999 నుంచి మొదలవుతుంది. ఈ ల్యాప్​టాప్​లు ఆధునిక టెక్నాలజీతో, తక్కువ ధరలో వ్యాపార అవసరాలను తీరుస్తాయి.

ఈ కార్యక్రమంలో 315 మందికి పైగా కస్టమర్లు పాల్గొని కొత్త ఫీచర్లను పరిశీలించారు. భద్రత కోసం ఫింగర్ ప్రింట్ రీడర్, హార్డ్​వేర్ ఎన్​క్రిప్షన్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. ఆఫీసు పనులు, మల్టీ టాస్కింగ్ కోసం ఇవి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని డెల్ పేర్కొంది.  ఏఎండీ, ఇంటెల్ ప్రాసెసర్లతో ఎసెన్షియల్​ ల్యాప్​టాప్​లు  అందుబాటులో ఉన్నాయి.