కోటి రూపాయల ఖరీదైన ఇళ్లు ఎగబడి కొంటున్నరు.. హైదరాబాద్‌‌‌‌లో లగ్జరీ ఇండ్లకు పెరిగిన డిమాండ్

కోటి రూపాయల ఖరీదైన ఇళ్లు ఎగబడి కొంటున్నరు.. హైదరాబాద్‌‌‌‌లో లగ్జరీ ఇండ్లకు పెరిగిన డిమాండ్

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: రూ.కోటి,  అంతకంటే ఎక్కువ ధర ఉన్న ఇండ్ల  రిజిస్ట్రేషన్లు హైదరాబాద్ రెసిడెన్షియల్ మార్కెట్‌‌‌‌లో భారీగా పెరిగాయి. కిందటేడాది మే నెలలో మొత్తం ఇండ్ల రిజిస్ట్రేషన్లలో ఈ సెగ్మెంట్ వాటా 14 శాతం ఉంటే, ఈ ఏడాది మేలో 19 శాతానికి  చేరుకుంది.  ఈ సెగ్మెంట్‌‌‌‌లో సేల్స్ వాల్యూమ్ ఏడాది లెక్కన 37 శాతం పెరిగింది.

మరోవైపు రూ.50 లక్షల కంటే తక్కువ (మొత్తం సేల్స్‌‌‌‌లో 50 శాతం వాటా), రూ.50 లక్షల నుంచి రూ. కోటి ధరల (26 శాతం వాటా) ఇండ్ల అమ్మకాలు తగ్గాయి.   ఈ ఏడాది మే లో రిజిస్టర్ అయిన రూ.కోటి పైబడిన ఇండ్ల మొత్తం విలువ మొత్తం ఇండ్ల రిజిస్ట్రేషన్ల విలువలో 49 శాతంగా ఉంది. 

ప్రీమియం ప్రాపర్టీలకు డిమాండ్ ఉందనే విషయం దీని ద్వారా తెలుస్తోందని  రెసిడెన్షియల్ కన్సల్టెన్సీ కంపెనీ నైట్ ఫ్రాంక్ పేర్కొంది.  హైదరాబాద్‌‌‌‌లో రిజిస్టర్ అయిన ప్రాపర్టీలలో ఎక్కువ (67శాతం) 1,000 నుంచి 2,000 చదరపు అడుగులు రేంజ్‌‌‌‌లో ఉన్నాయని పేర్కొంది.