హైదరాబాద్, వెలుగు: ఏఎన్ఎంలందరినీ రెగ్యులరైజ్చేయాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూ నియన్ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. సె కండ్ ఏఎన్ఎం, ఈసీ ఏఎన్ఎం, అర్బన్ హెల్త్సెంటర్ ఏఎన్ఎం, వైద్య విధాన పరిషత్ ఏ ఎన్ఎం, హెచ్ఆర్డీ ఏఎన్ఎంల సహా అందరినీ రెగ్యులరైజ్ చేయాల్సిందేనని కమిటీ తేల్చి చె ప్పింది.
ఆ డిమాండ్తోనే మంగళవారం నుంచి ఏఎన్ఎంలు సమ్మెకు వెళ్లాలని నిర్ణయించారు. ఆదివారం హైదరాబాద్లోని యూనియన్ రాష్ట్ర కమిటీ ఆఫీసులో కాంట్రాక్ట్ ఏఎన్ఎంల రాష్ట్ర స్థాయి సమావేశాన్ని నిర్వహించారు.
కాంట్రాక్ట్ ఏఎన్ఎంలకు రాత పరీక్ష విధానం రద్దు, పనిచేస్తున్నోళ్లను రెగ్యులరైజ్చేయడంతోపాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని గత నెల 31నే ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చామని కమిటీ నేతలు తెలిపారు.