
- డోర్టు డోర్ సర్వే చేస్తున్న వైద్యాధికారులు
జనగామ, వెలుగు: జిల్లాలో డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. జూన్ నుంచి ఇప్పటివరకు 40 కేసులు నమోదయ్యాయి. జ్వరపీడితులు ప్రభుత్వ, ప్రైవేట్హాస్పిటల్స్కు క్యూ కడుతున్నారు. దీంతో జిల్లా వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. గానుగు పహాడ్లో గత నాలుగైదు రోజుల్లో 7 డెంగ్యూ కేసులు నమోదవడంతో డీఎంహెచ్ వో మల్లికార్జున్రావు గురువారం ఆ గ్రామంలో పర్యటించారు.
డెంగ్యూ పాజిటివ్ వచ్చినవారి ఇండ్లకు వెళ్లి, వివరాలు సేకరించారు. వైద్య సిబ్బందితో కలిసి డోర్టు డోర్ సర్వేలో పాల్గొన్నారు. జ్వరంతో బాధ పడుతున్న పలువురితో మాట్లాడి, ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కొబ్బరి చిప్పలు, టైర్లు, ఇంటి ఆవరణలోని గుంతల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని చెప్పారు.