మైనింగ్ సెంట‌‌ర్ ఆఫ్ ఎక్స్ లెన్స్..ఏర్పాటుకు సహకరిస్తాం

మైనింగ్ సెంట‌‌ర్ ఆఫ్ ఎక్స్ లెన్స్..ఏర్పాటుకు సహకరిస్తాం
  • ఐఐటీ హైదరాబాద్, ఆస్ట్రేలియా వర్సిటీ ప్రతినిధులతో డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్, వెలుగు : ఐఐటీ హైద‌‌రాబాద్, ఆస్ట్రేలియాలోని మోనాష్ యూనివ‌‌ర్సిటీ స‌‌హ‌‌కారంతో రాష్ట్రంలో మైనింగ్ సెంట‌‌ర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్ అందిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. బుధవారం సెక్రటేరియెట్​లో ఆయనతో ఐఐటీ హైద‌‌రాబాద్ ప్రొఫెస‌‌ర్ మూర్తి, ఆస్ట్రేలియా మెల్ బోర్న్​లోని మోనాష్ యూనివర్సిటీ ప్రొఫెస‌‌ర్ ఎలిశెట్టి మోహ‌‌న్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

ఈ స‌‌మావేశంలో చర్చించిన అంశాల‌‌పై డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడారు. రాష్ట్రానికి మేలు చేసే ఏ అంశానికైనా ప్రభుత్వం త‌‌న మ‌‌ద్దతు ఇస్తుందని చెప్పారు. కొత్తగా ఏర్పాటు చేసే స్కిల్ యూనివ‌‌ర్సిటీతో ఐఐటీ హైద‌‌రాబాద్  భాగ‌‌స్వామ్యం అయ్యేందుకు ఆస‌‌క్తి చూపుతోంద‌‌ని భట్టికి ప్రొఫెస‌‌ర్ మూర్తి వివరించారు.