
- ఐఐటీ హైదరాబాద్, ఆస్ట్రేలియా వర్సిటీ ప్రతినిధులతో డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్, వెలుగు : ఐఐటీ హైదరాబాద్, ఆస్ట్రేలియాలోని మోనాష్ యూనివర్సిటీ సహకారంతో రాష్ట్రంలో మైనింగ్ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్ అందిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. బుధవారం సెక్రటేరియెట్లో ఆయనతో ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్ మూర్తి, ఆస్ట్రేలియా మెల్ బోర్న్లోని మోనాష్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎలిశెట్టి మోహన్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
ఈ సమావేశంలో చర్చించిన అంశాలపై డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడారు. రాష్ట్రానికి మేలు చేసే ఏ అంశానికైనా ప్రభుత్వం తన మద్దతు ఇస్తుందని చెప్పారు. కొత్తగా ఏర్పాటు చేసే స్కిల్ యూనివర్సిటీతో ఐఐటీ హైదరాబాద్ భాగస్వామ్యం అయ్యేందుకు ఆసక్తి చూపుతోందని భట్టికి ప్రొఫెసర్ మూర్తి వివరించారు.