- రేపు మధ్యాహ్నం 1.30 గంటలకు గవర్నర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం: డిప్యూటీ సీఎం భట్టి
- 9న సాయంత్రం6 గంటలకు ముగింపు
- మొదటిరోజు మధ్యాహ్నం 2.30 గంటలకు సీఎం ప్రసంగం
- 44 దేశాల నుంచి 154 మంది ప్రపంచస్థాయి డెలిగేట్స్
- ఒక్క అమెరికా నుంచే 46 మంది ప్రతినిధులు
- ఇది పొలిటికల్సమిట్ కాదు.. ఎకనామిక్ సమిట్ అని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: భారత్ ఫ్యూచర్ సిటీలో ఈ నెల 8,9వ తేదీల్లో నిర్వహించబోయే 2025 గ్లోబల్ సమిట్రాష్ట్ర భవిష్యత్తును మార్చివేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఇది పొలిటికల్ సమిట్ కాదని.. ఇది ఎకనామిక్ సమిట్అని పేర్కొన్నారు. శనివారం ప్రజా భవన్లో మంత్రులు శ్రీధర్బాబు, అజారుద్దీన్తో కలిసి గ్లోబల్ సమిట్ వివరాలను భట్టి విక్రమార్క మీడియాకు వివరించారు.
2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సాధనే లక్ష్యంగా రెండు రోజులపాటు గ్లోబల్ సమిట్ నిర్వహించబోతున్నామని తెలిపారు. నీతి ఆయోగ్ ఆఫీసర్లు, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) స్టూడెంట్స్ సంయుక్తంగా ఈ సమిట్కు సంబంధించిన అంశాలపై విజన్ డాక్యుమెంట్ రూపొందించారని వివరించారు. రెండు రోజులపాటు జరిగే సెషన్లలో ప్రభుత్వం రూపొందించిన డాక్యుమెంట్ అంశాలను వెల్లడిస్తామని చెప్పారు. అంతర్జాయస్థాయిలో పేరొందిన ఎకనమిస్టులు ఇందులో ప్రసంగిస్తారని తెలిపారు.
గవర్నర్ చేతుల మీదుగా ప్రారంభం
గ్లోబల్ సమిట్ను సోమవారం మధ్యాహ్నం 1.30 గంటలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిస్తారని భట్టి విక్రమార్క తెలిపారు. మొదటి రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు సీఎం రేవంత్రెడ్డి ప్రసంగం ఉంటుందని, ఆ తర్వాత తనతోపాటు ప్రపంచస్థాయి ఆర్థికవేత్తలు అభిజిత్ బెనర్జీ, ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీస్ గ్రూప్ సీఈఓ ఎరిక్ స్వైడర్, నోబెల్ అవా ర్డు గ్రహీత కైలాశ్ సత్యర్థి, కిరణ్ మజుందార్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, మంత్రి శ్రీధర్బాబు ప్రసంగిస్తారని చెప్పారు.
ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటల నుంచి వివిధ డిపార్ట్ మెంట్లకు సంబంధించిన సెషన్స్ ఉంటాయని పేర్కొన్నారు. ప్రతి సెషన్లో ఆ సెషన్కు సంబంధించిన మంత్రి, ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, సెషన్ ఎక్స్పర్ట్స్ పాల్గొంటారని వివరించారు. రెండో రోజు కూడా సెషన్స్ కొనసాగుతాయని చెప్పారు. 9న సాయంత్రం ముగింపు కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు.
6 ఖండాలనుంచి ప్రపంచస్థాయి డెలిగేట్స్..
గ్లోబల్ సమిట్లో పాల్గొనడానికి 6 ఖండాలు, 44 దేశాల నుంచి 154 మంది ప్రపంచస్థాయి డెలిగేట్స్ హాజరవుతున్నట్టు భట్టి వెల్లడించారు. ఒక్క అమెరికా నుంచే 46 మంది ప్రతినిధులు ఇందులో పాల్గొనబో తున్నారని తెలిపారు. అప్పటి వరకు ఎయిర్లైన్స్ సమస్య ఉంటే హెలికాప్టర్లలో ప్రతినిధులను ఇక్కడికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు.
అవసరమైతే ఎంఓయూలు: మంత్రి శ్రీధర్బాబు
ఇన్వెస్టర్లు రాష్ట్రానికి రావాలన్న సదుద్దేశంతోనే ఈ సమిట్ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి శ్రీధర్బాబు తెలి పారు. రైజింగ్ సమిట్ నచ్చి ఏదైనా కంపెనీ పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమైతే వెంటనే ఎంఓయూ ఒప్పందాలు చేసుకుంటామని తెలిపారు.
నాలుగు హాల్స్.. 27 సెషన్స్..
తెలంగాణ రైజింగ్ సమిట్ –2025 కార్యక్రమానికి సంబంధించి రెండు రోజుల పాటు జరిగే కార్యక్రమం కోసం రాష్ట్ర ప్రభుత్వం నాలుగు హాల్స్ ఏర్పాటు చేసింది. తక్కువ సమయం ఉండటం వల్ల ఒకే సమయంలో నాలుగు సెషన్స్ నిర్వహించుకునేలా ఈ ఏర్పాట్లు చేశారు. ఒక్కో హాల్లో ఒక్కో సెషన్ చొప్పున మొత్తం రెండు రోజుల్లో 27 సెషన్స్ నిర్వ హించనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి ప్రకటించారు.
- మొదటి రోజు (సోమవారం) మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు ‘పవరింగ్ తెలంగాణ ఫ్యూచర్’, ‘జీరో ఎమిషన్ వెహికిల్స్’, ‘సెమీకండక్టర్స్ ఫ్రం టైర్ టెక్నాలజీ’, ‘తెలంగాణ ఈస్ ఏ గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్’ సెషన్స్ జరుగుతాయి.
- సాయంత్రం 4.15 గంటల నుంచి 5.15 గంటల వరకు ‘ది రైజ్ ఆఫ్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్’, ‘టాలెంట్ మొబిలిటీ’, ‘హెల్త్కేర్ ఆఫ్ ఆల్’, ‘కొరియా’, ‘ఆస్ట్రేలియా’ సెషన్స్ నిర్వహిస్తారు.
- రాత్రి 5.30 గంటల నుంచి 6.30 గంటల వరకు ‘తెలంగాణ పార్ట్నరింగ్ విత్ ఏసియన్ టైగర్స్’, ‘గిగ్ ఎకానమీ’, ‘ఇన్క్రీజింగ్ ఫార్మర్స్ ఇన్కం థ్రూ వాల్యూ చైన్స్’, కెనడా సెషన్, ‘ఫాస్టరింగ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇన్ విమెన్’ సెషన్స్ జరుగతాయి. రాత్రి 7 గంటల తర్వాత గాలా డిన్నర్ ఏర్పాట్లు ఉంటాయి
- రెండో రోజు (మంగళవారం) ఉదయం 10 గంటల నుంచే సెషన్స్ మొదలవుతాయి. 10 గంటల నుంచి 11.30 గంటల వరకు ‘యాక్సలరేటింగ్ఇన్నోవేషన్ ఇన్ లైఫ్ సైన్సెస్’, ‘తెలంగాణ ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్’, ‘హెరిటేజ్, కల్చర్ అండ్ ఫ్యూచర్ రెడీ టూరిజం’, ‘లీవరేజింగ్ క్యాపిటల్ ప్రొడక్టివిటీ’, ఉదయం 11.45 గంటల నుంచి మధ్యాహ్నం 1.15 గంటల వరకు ‘ప్రాస్పెక్ట్ ఇన్ అఫర్డబుల్ హౌజింగ్ సెక్టార్’, ‘మూసీ రెజువనేషన్ అండ్ బ్లూ గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ హైదరాబాద్’, ‘ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ అర్బన్ రూరల్ కనెక్టివిటీ’, స్టాండ్ బై సెషన్స్ ఉంటాయి. మధ్యాహ్నం 1.15 గంటల నుంచి 2.15 గంటల వరకు లంచ్ సెషన్ ఉంటుంది.
- మంగళవారం మధ్యాహ్నం 2.15 గంటల నుంచి 3.45 గంటల వరకు ‘భారత్ ఫ్యూచర్ సిటీ యాస్ ఏ మ్యాగ్నెట్ ఫర్ 3 ట్రిలియన్ ఎకానమీ ఇన్ తెలంగాణ’, ‘ఈస్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2.0’, ‘గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్’,‘ ఇన్నోవేటిస్ పీపీపీస్ ప్రైవేట్ క్యాపిటల్ టువర్డ్స్ పబ్లిక్ గూడ్స్’పై సెషన్స్ నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటల నుంచి 5.30 గంటల వరకు ‘ఇండియాస్ సాఫ్ట్ పవర్ అండ్ ది ఫ్యూచర్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్’, ‘ఎక్స్పాండింగ్ అపర్చునిటీ ఫర్ ఎవ్రీవన్’, ‘క్యాపిటల్ అండ్ గ్రోత్’, ‘స్టార్ట్ ఆఫ్ ఎకో సిస్టమ్’ సెషన్స్ నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటలకు ‘తెలంగా ణ రైజింగ్ –2047’ విజన్ డాక్యుమెంట్ విడుదల చేస్తారు. రాత్రి 7 గంటలకు డ్రోన్ షో, 7.30 గంటలకు డిన్నర్.. ఆ తర్వాత కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి.
