
- మోదీది నియంతృత్వ పోకడ: భట్టి విక్రమార్క
- ప్రజలు మార్పును కోరుకుంటున్నరు
- పంజాబ్లో మూడో రోజు డిప్యూటీ సీఎం ప్రచారం
హైదరాబాద్, వెలుగు: ఇండియా కూటమి అధికారంలోకి వస్తేనే సుస్థిర ఆర్థిక విధానాలతో దేశం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం ఆయన పంజాబ్ లోని ఫరీద్ కోట్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు. వరుసగా మూడో రోజు డిప్యూటీ సీఎం ఫరీద్ కోట్ లో ప్రచారం చేశారు. అలాగే స్థానిక పార్టీ నేతలను సమన్వయం చేస్తూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఓటర్లతో మాట్లాడి పరిస్థితులను తెలుసుకుంటున్నారు. మోదీ ప్రభుత్వం పదేండ్లుగా అనుసరించిన పక్షపాత వైఖరి, వేధింపుల వల్లే దేశం నుంచి అనేక ప్రైవేటు పెట్టుబడులు తరలిపోయాయని ఆరోపించారు. కరెన్సీ నోట్ల రద్దు, జీఎస్టీ భారం, ఆకస్మిక లాక్ డౌన్ దేశంలోని కొద్ది మంది పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా వ్యవహరించడం వంటి మోదీ ప్రభుత్వ తప్పిదాల వల్లే దేశ ఆర్థిక అభివృద్ధి దెబ్బతిందని దుయ్యబట్టారు.
విద్వేష రాజకీయాలతో విసిగిపోయారు
మోదీ ప్రభుత్వం తీరుతో పారిశ్రామికవేత్తల్లో, పెట్టుబడుదారుల్లో ఏర్పడిన అపనమ్మకాన్ని ఇం డియా కూటమి ప్రభుత్వం తొలగిస్తుందని భట్టి అన్నారు. ‘‘రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరి రక్షించేందుకు దేశ ప్రజలు ఆసక్తిగా ఉన్నరు. మార్పును కోరుకుంటున్నరు. విద్వేష రాజకీయా లతో దేశం విసిగిపోయింది. ఇప్పుడు తమ సమస్యల పరిష్కారానికి ఓటర్లు మానసికంగా సిద్ధమ య్యారు. యువత ఉద్యోగాల కోసం, రైతులు కనీ స మద్దతు ధర కోసం, మహిళలు రుణ మాఫీ కో సం ప్రజలు ఓట్లు వేస్తున్నరు” అన్నారు. ప్రజల మధ్యన శతృత్వాన్ని, రాష్ట్రాల మధ్య విద్వేషాలను పెంచేలా మోదీ ప్రసంగాలు ఉన్నాయన్నారు. మోదీ అన్నీ తానై మొత్తం దేశాన్ని నడపాలని అనుకోవడం నియంతృత్వ పోకడలకు నిదర్శనమన్నారు.