కాంగ్రెస్ వల్లే ఆర్టీసీ బతికింది: భట్టి విక్రమార్క

కాంగ్రెస్ వల్లే ఆర్టీసీ బతికింది: భట్టి విక్రమార్క

కాంగ్రెస్ వల్లే ఆర్టీసీ బతికిందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.  గత పాలకులు  ఉంటే ఆర్టీసీ ఎప్పుడో  కనుమరుగయ్యేదన్నారు. సూర్యాపేట ఆర్టీసీ డిపోలో 45  ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు భట్టి. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన..మహాలక్ష్మీ పథకంలో ఆర్టీసీ గట్టెక్కిందన్నారు. కాలుష్య రహిత తెలంగాణ లక్ష్యంతో పనిచేస్తున్న ఆర్టీసీకి అభినందనలు తెలిపారు భట్టి.

 గత ప్రభుత్వం ఆర్టీసీని వదిలించుకుని ప్రయత్నం చేసింది.  కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఆర్టీసీని కాపాడే ప్రయత్నం చేస్తుంది.  ORR పరిధిలో 2,800 ఈవీ బస్సులను తీసుకొచ్చాం.  రాష్ట్ర వ్యాప్తంగా ఈవీ బస్సులను దశల వారిగా ప్రవేశపెడతాం.  మహాలక్మి పథకాన్ని విజయవంతంగా నడుపుతున్నాం.  దేశంలో విజయవంతంగా నడిపిన రాష్ట్రం లేదు . 182 కోట్ల జీరో ఉచిత టిక్కెట్లు ఇచ్చాం. 6088 కోట్ల రూపాయలు మహాలక్మి పథకం కింద ఆర్టీసీకి చెల్లించాం.  మహాలక్మి పథకంతో ఆర్టీసీని ఆర్థికంగా పరిపుష్టి చేశాం.  లేదంటే ఆర్టీసీకి ఆర్థికంగా నిలదొక్కుకునే పరిస్థితి ఉండేది కాదని అన్నారు భట్టి విక్రమార్క.

ALSO READ | రోడ్డెక్కిన 45 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు.. జెండా ఊపి ప్రారంభించిన మంత్రులు

 సూర్యాపేట ఆర్టీసీ డిపోలో 45 ఎలక్ట్రిక్ బస్సులను జెండా  ఊపి ప్రారంభించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు పద్మావతి , సామెల్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవర్ , ఎస్పీ నరసింహ, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి పాల్గొన్నారు. బస్సులు ప్రారంభించిన తర్వాత  బస్సులో ప్రయాణించారు మంత్రులు,ఎమ్మెల్యేలు.