రైల్వే యార్డులోనే.. తిరుపతిలో పట్టాలు తప్పిన పద్మావతి ఎక్స్ప్రెస్

రైల్వే యార్డులోనే.. తిరుపతిలో పట్టాలు తప్పిన పద్మావతి ఎక్స్ప్రెస్

తిరుపతి రైల్వే స్టేషన్ యార్డ్ లో పద్మావతి ఎక్స్‌ప్రెస్‌ బుధవారం ( జులై 19) పట్టాలు తప్పింది. తిరుపతి రైల్వే స్టేషన్ 6 వ ప్లాట్‌ ఫారంలో   పద్మావతి ఎక్స్‌ప్రెస్‌లోని ఒక బోగి పట్టాలు తప్పడంతో గుర్తించిన సిబ్బంది అధికారులను అప్రమత్తం చేశారు. సత్వర చర్యలు చేపట్టిన అధికారులు సమస్యను పరిష్కరించారు. షంటింగ్  చేస్తుండగా బోగీ పట్టాలు తప్పిందని వెల్లడించారు. ఈ కారణంగా పలు రైళ్లు ఆలస్యంగా బయలుదేరనున్నాయి. 

ALSO READ :చిన్న జంతువే కదా అని బెదిరించారా.. ఇక అంతే మీరు లగెత్తాల్సిందే..

తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు సాయత్రం 4.55 గంటలకు బయలు దేరాల్సిన 12763 నెంబర్‌ పద్మావతి ఎక్స్‌ప్రెస్‌ 19.45 ( రాత్రి 7.45) నిమిషాలకు బయలుదేరనుంది. 12793 నెంబర్‌ తిరుపతి - నిజాముద్దీన్ రాయలసీమ ఎక్స్ ప్రెస్ బయలుదేరే సమయం కూడా అధికారులు రీ షెడ్యూల్‌ చేశారు. సాయంత్రం 5.30 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరాల్సిన రాయలసీమ ఎక్స్ ప్రెస్ 20:00 ( రాత్రి 8) గంటలకు బయలుదేరనుంది. ఈ మేరకు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.