కర్ణాటక ఎన్నికల ఫలితాలు విడుదలవుతున్న వేళ.. పలు చోట్ల విభిన్న ట్రెండ్స్ నమోదవుతున్నాయి. వారసులు బరిలో దిగడంతో పోటీ ఆసక్తిగా మారింది. ఫలితాల్లో పలు చోట్ల వారి హవా కొనసాగుతోంది. షికారిపురలో యడ్యూరప్ప కుమారుడు విజయేంద్ర షికారిపుర నుంచి బరిలో దిగగా.. ఆయన ముందంజలో ఉన్నారు. ఏఐసీసీ చీఫ్ మల్లి ఖార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే చిత్తపుర్నుంచి ముందంజలో ఉన్నారు. దివంగత ఉమేష్ కట్టి కుమారుడు నిఖిల్ కట్టి హుక్కేరి నుంచి బరిలో దిగారు. ప్రస్తుతం ఆయనా ముందంజలో ఉన్నారు.
వెనకంజలో వీరే...
బెంగళూరు జయనగర నుంచి బరిలో దిగిన రామలింగారెడ్డి కుమార్తె సౌమ్య రెడ్డి వెనకంజలో ఉన్నారు. కుమార స్వామి కుమారుడు నిఖిల్ రామనగర నుంచి పోటీ చేయగా ప్రస్తుతం ఆయనా వెనకంజలో ఉన్నారు.