గుజరాత్ లోని ఓ ఆస్పత్రికి ప్రభుత్వం 45 లక్షల రూపాయిలు జరిమానా విధించింది. ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన కార్డు ఉన్నప్పటికి ఓ కుటుంబం నుంచి రూ 9 లక్షలు డిమాండ్ చేసింది. అహ్మదాబాద్లోని గురుకుల్లో ఉన్న స్టెర్లింగ్ ఆసుపత్రి యాజమాన్యం పీఎంజేఏవై కార్డు ఉన్నప్పటికి వైద్యం చేయడానికి నిరాకరించింది. బాధితులు సకాలంలో డబ్బులు చెల్లించకపోవడంతో వైద్యం చేయలేదు. దీంతో రోగి మృతి చెందడంతో... కుటుంబ సభ్యులు జిల్లా వైద్య అధికారులకు ఫిర్యాదు చేశారు.
అహ్మదాబాద్ నివాసి జశ్వంత్ నాయక్ భార్య రంజనా నాయక్కు గుండెపోటు రావడంతో అత్యవసర చికిత్స కోసం స్టెర్లింగ్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పీఎంజేఏవై కార్డు ఉన్నా.. వైద్యం కోసం డబ్బలు డిమాండ్ చేసింది ఆస్పత్రి యాజమాన్యం. నగదు డిపాజిట్ చేయకపోతే రోగిని వేరే ఆస్పత్రికి తరలించాలని సూచించింది. పరిస్థితి విషమంగా ఉండటంతో కుటుంబసభ్యులు నగదును ఆస్పత్రికి జమ చేశారు.
గతేడాది సెప్టెంబర్ 23 న తన భార్యకు గుండెపోటు రావడంతో స్టెర్లింగ్ ఆస్పత్రికి తరలించినట్లు జస్వంత్ నాయక్ తెలిపాడు. పేషెంట్ PMJAY కింద చికిత్స అర్హత ఉన్నప్పటికి ఆస్పత్రి వారు డబ్బులు అడిగడంతో చెల్లించారు. ట్రీట్మెంట్ ప్రారంభించినప్పడు మళ్లీ డబ్బులు అడగడంతో.. డబ్బులు చెల్లించేందుకు ఆలస్యం కావడంతో ... చికిత్స ఆపేశారని ఆరోపించాడర. చివరికి తన భార్య అక్టోబర్ 1న మరణించింది. ఆ తరువాత కూడా చికిత్స కు రూ. 9 లక్షలు చెల్లించాలని ఆస్పత్రి వారు పేషెంట్ కుటుంబసభ్యులపై ఒత్తిడి తెచ్చారు.
బాధితులు ఈ విషయాన్ని అహ్మదాబాద్ జిల్లా ఆరోగ్య అధికారికి ఫిర్యాదు చేశారు. ఓ కమిటి వేసి ఈ విషయంపై ఆరా తీయగా ఆస్పత్రి నిర్వాకం బయటపడింది. PMJAY మార్గదర్శకాలను ఆస్పత్రి పాటించలేదని తేలింది. దీంతో మృతుడి కుటుంబానికి ఏడు రోజుల్లోగా రూ. 9 లక్షలు.. జరిమానా కింద ప్రభుత్వానికి రూ. 45 లక్షలు చెల్లించాలని ఆస్పత్రి యాజమాన్యానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.