లాక్ డౌన్ క్రమంలో ఎన్నో కార్యక్రమాలు, మ్యారేజెస్ వాయిదాపడ్డ విషయం తెలిసిందే. కానీ కొందరు వీటిని గాలికి వదిలేస్తున్నారు. లాక్ డౌన్ రూల్స్ బ్రేక్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నా మ్యారేజ్ గ్రాండ్ గా జరిపిస్తున్నారు. ఈ క్రమంలోనే కరోనా కల్లోలం మధ్యన బెంగళూరులో శుక్రవారం ఉదయం మాజీ ప్రధాని దేవేగౌడ మనుమడు, మాజీ సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్ మ్యారేజ్ గ్రాండ్ గా జరిగింది. ఈ సందడిలో సోషల్ డిస్టెన్స్ అనే రూల్, దాంతోపాటే ముఖానికి మాస్కులు కూడా వేసుకోలేదు బంధువులు. బెంగళూరుకు 28 కిలోమీటర్ల దూరంలోని బిదడీలోని ఓ ఫాంహౌస్ లో ఈ పెళ్లి జరిగింది.
పెద్దగా రిలేషన్స్ రాలేదట కానీ.. అన్ని సాంప్రదాయాలు పాటించారట. నటుడిగా జీవితం ప్రారంభించి రాజకీయాల్లోకి దూకిన నిఖిల్ ఓ కాంగ్రెస్ నేత మనుమరాలి మెడలో మూడుముళ్లు వేశారు. తాత 86 ఏళ్ల దేవేగౌడ అక్షింతలు వేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ముందుగా బెంగళూరు నగరంలోనే పెళ్లి చేయాలని అనుకున్నారు. ఈలోగా కోవిడ్-19 మహమ్మారి వచ్చిపడింది. పెళ్లి వాయిదా వేసేందుకు కుమారస్వామి అంగీకరించలేదు. అందుకు బదులుగా వివాహవేదికను రెడ్ జోన్ అయిన బెంగళూరు నుంచి రామనగరకు మార్చారు. అక్కడున్న ఫ్యామిలీ ఫాంహౌస్ వివాహవేదిక అయింది. 60-70 మంది బంధువులు మాత్రమే హాజరైనట్లు సమాచారం.
దీనిపై స్పందించారట కర్నాటక ఉప ముఖ్యమంత్రి అశ్వత్థ నారాయణ. రూల్స్ బ్రేక్ చేసినట్లు తేలితే తప్పకుండా కుమారస్వామిపై చర్య తీసుకుంటామని చెప్పినట్లు తెలుస్తోంది.