కాంగ్రెస్ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జి వినయ్రెడ్డి
ఆర్మూర్, వెలుగు : కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం రేవంత్రెడ్డి హయాంలోనే ఆర్మూర్ లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని కాంగ్రెస్ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి అన్నారు.
శుక్రవారం ఆర్మూర్లోని రాంనగర్ కాలనీలో క్షత్రియ మినీ ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. ఆర్మూర్ టౌన్లో మంజూరైన నిధులతో గూండ్ల చెరువు , శ్మశాన వాటిక, రోడ్డు డివైడర్, సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు జరుగుతున్నాయన్నారు.
ఎస్ఎస్కే క్షత్రీయ మినీ ఫంక్షన్ హాల్ అభివృద్ధి కోసం రూ.10 లక్షల నిధులు మంజూరు చేయిస్తానన్నారు. కార్యక్రమంలో క్షత్రీయ సమాజ్ ప్రతినిధులు అల్జాపూర్ శ్రీనివాస్, సమాజ్ అధ్యక్షుడు బచ్చేవాల్ రెడ్డి ప్రకాశ్, కార్యదర్శి బారడ్ గంగామోహన్, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినీత, ఖాందేశ్సంగీత శ్రీనివాస్, గంగామోహన్ చక్రు, బారడ్ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
అనంతరం12వ వార్డు కాశి హనుమాన్ వీధి కాలనీ మున్నూరు కాపు పంథా సంఘం సభ్యులు మాజీ కౌన్సిలర్ తాటి హన్మంతుతో కలిసి వినయ్ రెడ్డిని కలిసి తమ సంఘం అభివృద్ధికి నిధులు మంజూరు చేయించాలని కోరగా, ఆయన సానుకూలంగా స్పందించారు.
