ముంబై: ఫోన్ ట్యాపింగ్ కేసులో మహారాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్కు ముంబై పోలీసులు సమన్లు జారీ చేశారు. ఆదివారం ఉదయం11 గంటలకు బీకేసీ సైబర్ పోలీస్ స్టేషన్లో హాజరై వాంగ్మూలం ఇవ్వాలని సీఆర్పీసీ సెక్షన్160 కింద నోటీసులు పంపారు. ఐపీఎస్ అధికారి రష్మీ శుక్లా రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగానికి నేతృత్వం వహిస్తున్న టైంలో అక్రమ ఫోన్ ట్యాపింగ్ చేశారని నమోదైన కేసులో ఫడ్నవీస్ సాక్షి అని రాష్ట్ర ప్రభుత్వం గతంలో కోర్టుకు తెలిపింది. తాజాగా ఈ కేసులో విచారణకు రావాలని పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. దీనిపై స్పందించిన ఫడ్నవీస్.. పోలీస్స్టేషన్కు వెళ్లి వాంగ్మూలం ఇస్తానన్నారు. సర్కారు కేసును నీరుగార్చాలని చూస్తోందని, స్కామ్స్టర్లను కాపాడాలనుకుంటోందని మహారాష్ట్ర ప్రభుత్వంపై ఆయన ఫైర్ అయ్యారు.