
- కొడుకు వీరేందర్ గౌడ్ సహా పార్టీలో చేరేందుకు సిద్ధం
హైదరాబాద్, వెలుగు: టీడీపీ సీనియర్ నేత దేవేందర్గౌడ్ బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. సోమవారమే ఆయన హైదరాబాద్ బంజారాహిల్స్లోని ఆయన నివాసంలో రాష్ట్ర అధ్యక్షుడు కే లక్ష్మణ్తో గంట పాటు భేటీ అయ్యారు. దేవేందర్ గౌడ్ కొడుకు వీరేందర్ కూడా బీజేపీలో చేరనున్నట్టు సమాచారం. మంగవారమే ఢిల్లీ చేరుకున్న ఆయన బుధవారం లేదంటే గురువారం బీజేపీ ముఖ్యనేతలను కలుస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆయనతో పాటు మరి కొంత మంది బీసీ ముఖ్య నేతలు బీజేపీలో చేరతారని ప్రచారం నడుస్తోంది. చంద్రబాబు సర్కార్లో దేవేందర్గౌడ్ కీలకమైన హోంశాఖ, రెవన్యూ శాఖల మంత్రిగా పనిచేశారు.