తిరుచానూరు పద్మావతి అమ్మవారికి రూ. 23 లక్షల విలువజేసే జత కర్ణపత్రములు బహుకరించారు ఓ భక్తుడు. గురువారం ( జనవరి 29 ) అమ్మవారి దర్శించుకున్న భక్తుడు కర్ణపత్రములు టీటీడీ అధికారులకు అందజేశారు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. హైదరాబాద్కు చెందిన శ్రీ కె. దీపక్ 178 గ్రాముల బరువు కలిగిన బంగారు, రాళ్లతో పొదిగిన జత కర్ణపత్రములను బహుకరించారు.
దాదాపు రూ. 23 లక్షల విలువైన ఈ జత కర్ణపత్రములను టిటిడి అధికారులకు అందజేశారు భక్తుడు. శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనానంతరం దాతకు తీర్థప్రసాదాలు అందజేశారు టీటీడీ అధికారులు.
ఈ కార్యక్రమంలో టిటిడి డిప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, ఆలయ అర్చకులు శ్రీ బాబు స్వామి, సూపరింటెండెంట్ శ్రీ సురేష్, ఏవీఎస్వో శ్రీ రాధాకృష్ణ, టెంపుల్ ఇన్స్పెక్టర్లు శ్రీ చలపతి, శ్రీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
