శ్రీశైలం మల్లన్న ఆలయానికి పెరిగిన రద్దీ

శ్రీశైలం మల్లన్న ఆలయానికి పెరిగిన రద్దీ

శ్రీశైలం, వెలుగు: అమావాస్య సోమవారం కావడంతో శ్రీశైలం మల్లన్న క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. భక్తులతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. వేకువజాము నుంచే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి, అమ్మవార్ల దర్శనం కోసం క్యూలైన్​లో  బారులు తీరారు.

దర్శనానికి 6 గంటల సమయం పట్టింది. స్వామి, అమ్మవార్లకు రుద్రాభిషేకం, కుంకుమార్చన తదితర పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆలయ ఈవో లవన్న, ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

ALSO READ :సెమీస్ లో ఇండియా..నేపాల్ పై గ్రాండ్ విక్టరీ