
వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు కావడంతో స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు. కోడె మొక్కుల కోసం భక్తులు క్యూ కట్టారు. స్వామి వారి దర్శనం కోసం 4 గంటల సమయం పడుతోంది. స్వామి వారి ప్రసాదం కౌంటర్స్, కళ్యాణ కట్ట భక్తులతో కిక్కిరిసిపోయింది. భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.