ప్రత్యేక ఆకర్షణగా తుమ్మలగుంట వినాయకుడు

ప్రత్యేక ఆకర్షణగా తుమ్మలగుంట వినాయకుడు

తిరుపతి: వినాయక చవితి సందర్భంగా భక్తులు ఆది దేవుడు గణనాధుడిని ఘనంగా కొలుచుకుంటున్నారు. వాడవాడలా వెలసిన తీరొక్క గణనాధులు ఆకట్టుకుంటున్నారు. తిరుపతి తుమ్మలగుంటలో వెలసిన లంబోదరుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.7 వేల పైనాపిల్స్ తో వినాయకుడి ప్రతిమ తయారు చేశారు. ఇక మండపంలో మంగళ వాయిద్యాలను వాయిస్తున్నట్టు గణనాధులను తీర్చిదిద్దారు. చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు హర్షిత్ రెడ్డి ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వెరైటీ గణానాధుడిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.