తిరుమలకు పోటెత్తుతున్న భక్తులు

తిరుమలకు పోటెత్తుతున్న భక్తులు

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు కావడంతో తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. స్వామి వారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. 24 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న స్వామి వారిని 71 వేల 119 మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ ఆదాయం 3 కోట్ల 91 లక్షలు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. 37 వేల 356 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.