ఉచిత దర్శనానికి రెండు గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట

 ఉచిత దర్శనానికి రెండు గంటలు,  ప్రత్యేక దర్శనానికి గంట

యాదాద్రి భువనగిరి జిల్లా :- పంచనారసింహ క్షేత్రంగా విలసిల్లుతున్న ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. ఆదివారం సెలవురోజు కావడంతో వివిధ ప్రాంతల నుంచి యాదాద్రికి భక్తులు భారీగా తరలివచ్చారు.  ఉదయం నుండి స్వామివారికి మొక్కులు తీర్చుకోవడానికి వేకువ జాము నుండే క్యూలైన్లో భక్తులు బారులు తీరారు. దీంతో స్వామివారి ఉచిత దర్శనానికి రెండు గంటల సమయం,  ప్రత్యేక దర్శనానికి గంట సమయం పుడుతుంది. భక్తుల రద్దీని దృష్ట్యాలో ఉంచుకొని ఆలయంలో లఘు దర్శన సౌకర్యాన్ని అధికారులు ఏర్పాటు చేశారు.