అమరావతి : శ్రీకాకుళం జిల్లాలో అనాధ శవం పట్ల మానవత్వం చాటిన ఎస్సై శిరీషకు డీజీపీ డిస్క్ అవార్డును అందించారు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్. అవార్డుతో పాటు ప్రశంసా పత్రాన్ని అందజేశారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై శిరీష ఇటీవల ఓ అనాథ శవాన్ని కిలోమీటర్ వరకూ తన భుజాలపై మోసుకుంటూ తీసుకెళ్లారు.ఓ స్వచ్ఛంద సంస్థతో కలిసి ఆమె అంతిమ సంస్కారాలు చేశారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆమె చేసిన పనికి సామాన్యులతో పాటు ప్రముఖుల నుంచి ప్రశంసలు దక్కాయి.
see more news