ల్యాండ్​ మాఫియాపై 27 ఏళ్లుగా ధర్నా

ల్యాండ్​ మాఫియాపై 27 ఏళ్లుగా ధర్నా

ఈ ఫొటోలో కనిపిస్తున్న  యువకుడు, వృద్ధుడు ఒక్కరే.  ఈయన పేరు విజయ్​సింగ్​. ఉత్తరప్రదేశ్​లోని ముజఫర్​నగర్​ సిటీ నడిబొడ్డులో ఉన్న శివ్​చౌక్ వేదికగా ఆయన గత 27 ఏళ్లుగా ధర్నా చేస్తున్నారు. లంచగొండితనం, ల్యాండ్​ మాఫియాలపై దాదాపు 3 దశాబ్దాలుగా ఫైట్​ చేస్తున్నారు. కబ్జాకోరుల చెర నుంచి ఎన్నో ప్రభుత్వ భూములను ఆయన విడిపించారు. 1996 సంవత్సరం వరకు విజయ్ సింగ్​ స్కూల్​టీచర్​గా పనిచేశారు. అయితే తన ఊరి (షామ్లీ జిల్లా చౌసానా)లోని ప్రభుత్వ భూమిని ల్యాండ్​ మాఫియా ఆక్రమించుకోవడాన్ని చూసి సహించలేకపోయారు. భూకబ్జాలపై పోరాడేందుకు టీచర్​ జాబ్​ వదిలేసి 1996 ఫిబ్రవరి 26న ధర్నాను ప్రారంభించారు.