
పెద్దపల్లి, వెలుగు: మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని పెద్దపల్లి జిల్లా మిడ్ డే మీల్స్ వర్కర్స్ డిమాండ్ చేశారు. గురువారం పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలన్నారు.
అంగన్వాడీ సెంటర్లకు అందించినట్లుగానే గ్యాస్, నిత్యావసరాలు, సరుకులు మిడ్ డే మీల్స్ స్కీముకు అమలుచేయాలన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ మిడ్ డే మీల్స్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పూసల రమేశ్, కార్మికులు రాజేశ్వరి, కళావతి, లక్ష్మీ, వరలక్ష్మి, అంజు పాల్గొన్నారు.