మెట్ పల్లి మున్సిపాలిటీ కార్యాలయం ముందు పారిశుధ్య కార్మికుల ధర్నా

మెట్ పల్లి మున్సిపాలిటీ కార్యాలయం ముందు పారిశుధ్య కార్మికుల ధర్నా

జగిత్యాల జిల్లా మెట్ పల్లి మున్సిపాలిటీ కార్యాలయం ముందు పారిశుధ్య కార్మికుల ధర్నా చేపట్టారు. తమకు గత రెండు నెల జీతాలు రావడం లేదని.. నాలుగు నెలల పీఆర్సీ బకాయిలు, 9 నెలల ఏరియల్స్ తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. తమకు జీతాలు చెల్లించేంత వరకు ధర్నా కొనసాగుతుందని వెల్లడించారు.

దీంతో మెట్ పల్లి పట్టణంలో చెత్త ఎక్కడిక్కడ ఉండిపోయింది. చెత్త సేకరణ, పారిశుద్ధ పనులు నిలిచి.. వీధుల్లో కంపు కొడుతోంది.