కలర్ ఫుల్ కైట్స్.. మస్త్ క్రేజ్​

కలర్ ఫుల్ కైట్స్..  మస్త్ క్రేజ్​
  • కలర్ ఫుల్ కైట్స్..  మస్త్ క్రేజ్​
  • సిటీలో పతంగుల పండుగ షురూ 
  • పిల్లలు, యూత్ ఫుల్ ఎంజాయ్
  • తయారీకి ధూల్‌‌పేట చాలా ఫేమస్  
  • 2 నెలల ముందుగానే కైట్స్ మేకింగ్​  
  • లోకల్​ పతంగులు, మాంజాకు ఫుల్​గిరాకీ

హైదరాబాద్​, వెలుగు: సంకాంత్రి వస్తుందంటే సిటీలో పతంగులకు ఎంతో క్రేజ్ ఉంటుంది.  వాటిని ఎగరవేస్తూ, కీంచ్ కట్ చేస్తూ పిల్లలు, యువకులు మస్త్​ఎంజాయ్​ చేస్తుంటారు. పతంగుల తయారీకి ధూల్​పేట చాలా ఫేమస్. వివిధ డిజైన్లలో కలర్ ఫుల్ పతంగులను రూపొందిస్తుంటారు. అయితే.. లోకల్‌‌ పతంగులు,  మాంజాను కొనేందుకు సిటీ నుంచే కాకుండా తెలంగాణలోని జిల్లాలు, పక్క రాష్ట్రాల నుంచి కైట్ లవర్స్ వస్తుంటారు.  ధూల్​పేట లో హోల్‌‌సేల్‌‌గా కొనుగోలు చేసి తీసుకెళ్తుంటారు.  ప్రతి ఏటా సంక్రాంతికి రెండు నెలల ముందు నుంచే పతంగుల తయారీ మొదలవుతుంది. పండగ సమీపిస్తుందంటే.. ధూల్​పేటతో పాటు సిటీ అంతటా కలర్ ఫుల్ పతంగులు షాపుల్లో కనువిందు చేస్తుంటాయి.  

లోకల్ కైట్.. మాంజాకు క్రేజ్‌‌​

ఇతర రాష్ట్రాల నుంచి ఎన్ని రకాల పతంగులు వచ్చినా.. ధూల్​పేట పేపర్​పతంగులు, మాంజాకు ఉండే క్రేజే వేరు. ఇక్కడ కవర్, పేపర్, క్లాత్​ పతంగులు అమ్ముతారు.  వీటిలో కవర్​ పతంగులు యూపీ, వెస్ట్​ బెంగాల్, మధ్యప్రదేశ్ ల నుంచి,  క్లాత్​ పతంగులను చైనా నుంచి దిగుమతి చేసుకుంటారు.  పేపర్​పతంగులు మాత్రం ధూల్​పేటలోనే తయారవుతాయి. దిగుమతి చేసుకునే పతంగులు క్వాలిటీగా ఉండవు. లోకల్​పేపర్​ పతంగులు మాత్రం క్వాలిటీ, థ్రెడ్‌‌ను కలిగి ఉంటాయి.  దీంతో కస్టమర్లు లోకల్​పేపర్​ కైట్స్ కొనేందుకు  ఎక్కువ ఆసక్తి చూపుతారు. పేపర్​పతంగి ధర రూ. 10  నుంచి రూ. 100 ఆపైన దొరుకుతాయి. ప్రభుత్వం చైనా మాంజాను బ్యాన్​చేయడంతో లోకల్​మాంజాలకు డిమాండ్​ పెరిగింది.  ప్రస్తుతం ధూల్​పేట్​ మార్కెట్‌‌లో ప్రధానంగా బరేలీ, గన్, కృష్ణ, సంకల్ప్​మాంజాలు అందుబాటులో ఉండగా.. వీటిలో కృష్ణ సంకల్ప్​మాంజాలు లోకల్‌‌గానే తయారు చేస్తారు. 

సీజనల్​పండుగలకు అడ్డా..

వినాయక చవితి, దసరా, దుర్గామాత, దీపావళికి పటాకులు, రాఖీ పౌర్ణమి, సంక్రాంతికి పతంగులు ఇలా..  పండుగేదైనా దానికి సంబంధించిన విగ్రహాలు, వస్తువులు దొరికేది మాత్రం ధూల్​పేటలోనే.  ఆయా సీజన్లలో ముడి సరుకు తెచ్చుకొని అక్కడి వ్యాపారులు ఇండ్లలోనే పతంగులు, రాఖీలు, విగ్రహాలు తయారు చేస్తుంటారు. 

సైజులను బట్టి ధరలు

ట్రెండింగ్​యూనిక్​ పతంగులు ధూల్​పేటలో అందుబాటులో ఉన్నాయి.  రకరకాల సైజుల్లో కవర్, పేపర్, క్లాత్​పతంగులు, ఆర్డీనరీ మంజా నుంచి క్వాలిటీ మాంజా దాకా అందుబాటులో లభిస్తాయి.  వాటి సైజులను బట్టి ధరలు ఉంటాయి.  21 సెం.మీ కవర్​ పతంగుల బెండల్‌‌లో 160 పీసులు ఉంటాయి. లో 160  పీసులు ఉంటాయి.  దాని ధర రూపాయలు. 42 సెంమీ పతంగీల బెండల్ 100 పతంగులకు 1,230 రూపాయలు.  పేపర్​ పతంగులు ఒక్కోటి రూ. 10  నుంచిమొదలై వందల రూపాయలు, క్లాత్​ పతంగులు 100 నుంచి వేలల్లో ఉన్నాయి. 

 రూ. లక్షల్లో హోల్​సేల్  బిజినెస్ 

ప్రతి సీజన్‌‌లో లక్షల్లో బిజినెస్​అవుతుందని వ్యాపారులు చెబుతున్నారు.  రెండు మూడు నెలల నుంచే వివిధ జిల్లాలు, సమీప రాష్ట్రాల వ్యాపారులు పతంగులు అడ్వాన్స్​ బుకింగ్స్​ చేసుకుంటారని పేర్కొన్నారు. సంక్రాంతి సమయానికి ధూల్​పేటలో దాదాపు 300 దాకా పతంగులు షాపులు ఉంటాయని,  ప్రతి దాంట్లో  వేల పతంగులు అమ్ముడవుతాయని, లక్షల బిజినెస్  జరుగుతుందని చెప్పారు.

ప్రస్తుతం అమ్మకాలు నడుస్తున్నాయి

ప్రతి ఏడాది రెండు నెలల ముందు నుంచే ఆర్డర్లు వస్తాయి.  పేపర్​పతంగులను మేమే తయారు చేస్తాం.  ప్లాస్టిక్​ కవర్, క్లాత్​ పతంగులు మాత్రం ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటాం. ఈ సీజన్‌‌లో ముడి సరకు ధరలు పెరిగాయి.  దీంతో పతంగుల ధరలు కూడా పెంచాల్సి వచ్చింది.  ప్రతి సీజన్‌‌ లాగే ఈసారి కూడా బిజినెస్‌‌ బాగుంటుందని అనుకుంటున్నా. 
- మహాదేవ్​ సింగ్​, భవాని ఎంటర్​ప్రైజెస్​, ధూల్​పేట