రాయదుర్గం నాలెడ్జి సిటీలోని టీహబ్ వద్ద ఆదివారం డయాబెటిస్ అవగాహన కోసం వాకథాన్ నిర్వహించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ రమేశ్ గోరంట్ల, సినీ నటుడు సుశాంత్, కిమ్స్ ఎండీ డాక్టర్ భాస్కర్ రావు ముఖ్యఅతిథులుగా హాజరై ఈ వాకథాన్ను ప్రారంభించారు. ఐటీ ఉద్యోగులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. – వెలుగు, గచ్చిబౌలి
