కుషాయిగూడ, వెలుగు: కీసర పోలీస్స్టేషన్పరిధిలోని రాంపల్లిలో పైప్ లైన్లను పగులగొట్టి గుట్టు చప్పుడు కాకుండా డీజిల్, పెట్రోల్చోరీ చేసిన నిందితులు మంగళవారం కోర్టులో లొంగిపోయారు. వీరి నుంచి 23.7 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ముఠా సభ్యులలో 10 మంది నిందితులను అరెస్ట్ చేయగా, మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. డీజిల్, పెట్రోల్ రవాణా చేసే నిందితుడు సూర్యాపేట నివాసి తుమ్మూరు నరేష్ రెడ్డి(30) ఈనెల 17న మల్కాజిగిరి కోర్టులో లొంగిపోయాడు.
కీసర పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే పరారీలో ముంబైకి చెందిన వాసు, వెస్ట్ బెంగాల్కి చెందిన చెద్ద పరారీలో ఉన్నారు. వీరిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు.