డీజిల్​ ట్యాంక్​ లీక్.. లారీలు దగ్ధం

డీజిల్​ ట్యాంక్​ లీక్..  లారీలు దగ్ధం

డీజిల్​ట్యాంక్ లీక్​ అయి లారీలు దగ్ధం అయిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జూలూరుపాడు మండల కేంద్రానికి డీజిల్​ ట్యాంక్​తో నిండి ఉన్న లారీలు వచ్చాయి. పత్తి మార్కెట్​ యార్డ్​ సమీపంలోకి రాగానే రెండు లారీలు అశోక్​ లే ల్యాండ్​ వాహనాన్ని ఢీ కొట్టాయి. ఈ ప్రమాదంలో లారీ డీజిల్​ ట్యాంక్​ లీక్​ అయింది. దీంతో మంటలు చెలరేగాయి. 

ఘటనలో రెండు లారీలు పూర్తిగా దగ్ధం అయ్యాయి. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి.  అతన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఫైర్​ స్టేషన్ సిబ్బంది వచ్చి మంటల్ని ఆర్పేశారు. రోడ్డు ఇరుగ్గా ఉండటంతో భారీగా ట్రాఫిక్​ జామ్​ అయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.