మహబూబ్నగర్, వెలుగు:రాష్ట్రంలో ఎన్ని ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి, దిగుబడి ఎంత వస్తుందో అంచనా వేసేందుకు ప్రభుత్వం మూడేళ్లుగా పంటల నమోదు చేపడుతోంది. ఈసారి ఏఈవోలు ఫీల్డ్కు వెళ్లి సర్వే నంబర్ల ఆధారంగా పంటలు నమోదు చేయాలని, ఆగస్టు 31వ తేదీ వరకు దీన్ని పూర్తి చేయాలని డెడ్లైన్పెట్టింది. క్షేత్రస్థాయిలో ఏఈవోలు పంటల నమోదుకు వెళ్తున్నా, సర్వే నంబర్లను ఐడెంటిఫై చేయడం కష్టంగా మారింది. ఒకే సర్వే నంబర్మీద ఐదారు బై నంబర్లు ఉండటం.. ఏ రైతు ఏ సర్వే నంబర్ మీద పొజిషన్లో ఉన్నాడో తెలియక ఆన్లైన్లో ఎంట్రీ చేయడం తలకు మించిన భారంగా మారింది. దీనికితోడు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి సహాయకులు లేకపోవడంతో ఈ ప్రాసెస్ లేట్అవుతోంది. తెలంగాణలో 63 లక్షల మంది రైతులు ఉండగా, 2,602 అగ్రికల్చర్ క్లస్టర్లు ఉన్నాయి. వీటిలో 2,400 మంది రెగ్యులర్ ఏఈవోలు, 202 మంది అవుట్సోర్సింగ్కింద వర్క్ చేస్తున్నారు. వీరంతా ప్రస్తుతం సర్వే నంబర్ల ఆధారంగా పంటలు నమోదు చేసేందుకు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు ఫీల్డ్లో తిరుగుతున్నారు. ఒక్కో ఏఈవో క్లస్టర్పరిధిలోని 4,500 నుంచి 5,500 ఎకరాల వివరాలను ఆన్లైన్లో ఎంట్రీ చేయాలి. అది కూడా రైతు పొలం నుంచే జీపీఎస్ ఆధారంగా యాప్లో అప్లోడ్ చేయాలి. కానీ ఫీల్డ్లో రెవెన్యూ ఆఫీసుల నుంచి వీరికిచ్చిన సర్వే నంబర్ల ఆధారంగా పంటలు ఉండటం లేదు. ఏ పొలం ఏ రైతుదో తెలియడం లేదు. పంట సాగు చేస్తున్న రైతును పిలిపించి అడిగినా ఫలానా సర్వే నంబర్అని చెబుతున్నారే తప్ప బై నంబర్లుగా ఉన్న వాటి గురించి తెల్వదని అంటున్నారు. వీటి గురించి తెలిసిన వీఆర్ఏలు సమ్మెలో ఉండటంతో సర్వేలో పాల్గొనడం లేదు. దీంతో పంటల నమోదుకు వెళ్తున్న అగ్రికల్చర్ఆఫీసర్లు సర్వే నంబర్ల ఆధారంగా పంట వివరాలు నమోదు తమ వశమైతలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజులో కనీసం 40 నుంచి 50 ఎకరాల వివరాలు కూడా ఆన్లైన్లో ఎంట్రీ చేయలేకపోతున్నామని చెబుతున్నారు. 31వ తేదీ వరకు ఇది కంప్లీట్ చేయాలని వ్యవసాయ శాఖ కమిషనర్ఐదు రోజుల కిందట డెడ్లైన్పెట్టడంతో ఆందోళనకు గురవుతున్నారు. పైగా రోజూ మీ ఏరియాలో ఎన్ని పంటల వివరాలు ఎంట్రీ చేశారు.. బ్యాలెన్స్ఎంత ఉందని స్టేట్ఆఫీషియల్స్జిల్లా అగ్రికల్చర్ఆఫీసర్లకు వాట్సప్ మెసేజ్లు పెడుతున్నారు. వారు జిల్లాల వాట్సాప్గ్రూపుల్లో ఏఈవో వైజ్గా ఫార్మాట్ తయారుచేసి ఇంత పెండింగ్ఉందంటూ పోస్టులు చేస్తున్నారు. అలాగే కమిషనరేట్ నుంచి జిల్లాలకు స్పెషల్ఆఫీసర్లను ఏర్పాటు చేసి ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. దీని వల్ల ఏఈవోలు ఒత్తిడికి గురవుతున్నారు. మరో వారం రోజుల్లో ఇది పూర్తి చేయలేమని పాలమూరు జిల్లాకు చెందిన జిల్లా ఏఈవోలు ఇటీవల జిల్లా అగ్రికల్చర్ఆఫీసర్కు వినతిపత్రం ఇచ్చారు.
ఇంటర్నెట్సౌకర్యం ఇయ్యలె..
సర్వే నంబర్ల ఆధారంగా పంటల నమోదుకు మొబైల్యాప్ను క్రియేట్చేసి లింక్ను ప్రభుత్వం ఏఈవోలకు పంపింది. లింక్ ద్వారా యాప్ను మొబైల్లో డౌన్లోడ్చేసుకోవాలని చెప్పింది. కానీ 1.5 జీబీ ఇంటర్నెట్ డేటా ఫెసిలిటీ మాత్రమే కల్పించారు. ఈ డేటాతో జీపీఎస్ఆన్చేసి వివరాలు నమోదు చేస్తుంటే మధ్యలోనే నెట్అయిపోతోంది. మధ్యలో ఫోన్కాల్స్ రిసీవ్ చేసుకుంటే యాప్మళ్లీ ఫస్ట్నుంచి లాగిన్ అడుగుతోంది. దీంతో ఆ టైంలో నమోదు చేసిన వివరాలు మొత్తం మళ్లీ ఫస్ట్ నుంచి చేయాల్సి వస్తోంది. కొన్నిచోట్ల మారుమూల ప్రాంతాల్లో నెట్రావట్లేదు. అక్కడ పంటల వివరాలు నమోదు చేయడం లేదు. రైతుబంధు, రైతుబీమా, ఇతర వ్యవసాయానికి సంబంధించిన డేటాను ఆన్లైన్లో ఎంట్రీ చేయడానికి 2017లో ఏఈవోలకు ట్యాబ్లు ఇవ్వగా ప్రస్తుతం అవి పనిచేయడం లేదు. దీంతో ఏఈవోలు వారి సొంత ఫోన్ల నుంచే వివరాలు నమోదు చేస్తున్నారు. విలేజ్లలో నెట్వర్క్ వచ్చిపోతుండటంతో ఇబ్బందులు వస్తున్నాయి.
యాప్లో టెక్నికల్ మిస్టేక్స్
ప్రొక్యూర్మెంట్టైంలో ఆన్లైన్లో ఎంట్రీ చేసిన వివరాల ఆధారంగానే పంటలను ప్రభుత్వం కొననుంది. ఆన్లైన్లో పంట వివరాలు లేకుంటే ఆ పంటను గవర్నమెంట్సెంటర్లో కొనరని స్పష్టం చేసింది. ప్రస్తుతం భారీ వర్షాలకు గోదావరి నదికి వరదలు రావడం వల్ల కరీంనగర్, వరంగల్, మంచిర్యాల, ఖమ్మం, నిర్మల్, ములుగు, జయశంకర్భూపాలపల్లి ఇతర జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నాయి. మహబూబ్నగర్ జిల్లాలోని చెరువుల్లో ఇంకా నీళ్లు చేరలేదు. వీటికింద చాలా పంటలు ఇంకా వేయలేదు. అయితే, ఈ వివరాలను ఎంట్రీ చేసేందుకు యాప్లో ‘నో క్రాప్’ అనే అప్షన్ను అందుబాటులోకి తీసుకురాలేదు. దీంతో ప్రస్తుతం పంటలు వేయకుండా ఉన్న పొలాల వివరాలు ఎంట్రీ చేయడం లేదు. ఈ నెల చివరి వారం వరకు కొన్నిచోట్ల వరి, మక్కలు వేయనున్నారు. ఆ వివరాలు ఆన్లైన్లో నమోదు చేసే అవకాశం లేకపోవడంతో ఈ పంటలు అమ్ముకునేందుకు రైతులు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడనుంది.
గడువు పెంచాలి
పంట నమోదుకు గ్రామాలకు వెళ్లడానికి చాలాచోట్ల రోడ్డు సౌకర్యం లేదు. 50 శాతం మంది మహిళా ఏఈవోలు ఉన్నారు. ఫిజికల్గా తిరిగి చేసే పని కాబట్టి సెప్టెంబరు 31 వరకు గడువు ఇవ్వాలి. ట్యాబ్లు సమకూర్చడంతోపాటు వీఆర్ఏను అసిస్టెంట్గా ఇవ్వాలి. అవసరమైన అన్ని వసతులు కల్పిస్తేనే అనుకున్న టైంలోగా పని పూర్తి చేయగలం.
–శ్రీనివాస్ గౌడ్, స్టేట్ ప్రెసిడెంట్, తెలంగాణ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ఆఫీసర్స్ అసోసియేషన్ సెంట్రల్ ఫోరం