హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర సెయిలింగ్ చాంపియన్షిప్లో దీక్షిత కొమరవెల్లి అగ్రస్థానంలోకి దూసుకొచ్చింది. బాలికల సబ్ జూనియర్ విభాగంలో శుక్రవారం జరిగిన పోటీల్లో దీక్షిత, లాహిరి కొమరవెల్లి చెరో 17 పాయింట్లతో సమంగా నిలిచారు. అయితే ఏడు రేస్ల తర్వాత ఒక్కదాన్ని మినహాయించేందుకు (డిస్కార్డ్) అనుమతి ఇవ్వడంతో దీక్షిత ఒక్క పాయింట్ తేడాతో టాప్ ప్లేస్ను సాధించింది.
ప్రస్తుతం ఈ ఇద్దరు గోల్డ్, సిల్వర్ కోసం పోటీపడుతున్నారు. శనివారం జరిగే చివరి రేస్ తర్వాత విన్నర్ ఎవరో తేలనుంది. బిందు రత్లావత్ (52 పాయింట్లు) మూడో ప్లేస్లో నిలిచింది. సబ్ జూనియర్ బాలుర విభాగంలో బన్నీ బొంగూర్ అగ్ర స్థానంలో ఉండగా, వినోద్ (33 పాయింట్లు), మహ్మద్ రిజ్వాన్ (35 పాయింట్లు) వరుసగా మూడు ప్లేస్ల్లో కొనసాగుతున్నారు. జూనియర్ ఓపెన్ కేటగిరీలో వైష్ణవి (6 పాయింట్లు) రెండు విజయాలు సాధించింది. ఝాన్సీ ప్రియా లావేటి- (9 పాయింట్లు), శ్రవణ్ కత్రావత్ -(11 పాయింట్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.