డార్లింగ్ అభిమానులకు పండగలాంటి వార్త వినిపించాడు నిర్మాత దిల్ రాజు. దర్శకుడు ప్రశాంత్ నీల్తో ప్రభాస్ ‘సలార్’ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే కాకుండా వీరిద్దరూ కలిసి రెండో సినిమాను కూడా ప్లాన్ చేశారు. ఈ విషయాన్ని తాజాగా దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. త్వరలోనే ప్రశాంత్తో ప్రభాస్ ఓ పౌరాణిక సినిమాలో నటించనున్నాడని తెలిపాడు.
ఈ వార్త డార్లింగ్ అభిమానుల్లో కొత్త జోష్ను నింపుతోంది. ఇప్పటికే బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్తో ఆదిపురుష్ లో ప్రభాస్ నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరో పీరియాడికల్ సినిమా అప్డేట్ ఇంట్రెస్టింగ్ గా మారింది. సలార్ తర్వాత ప్రశాంత్ ఎన్టీఆర్తో ఓ సినిమా చేయనున్నాడు. ఆ తర్వాతే ఈ సినిమా పట్టాలెక్కనున్నట్టు తెలుస్తోంది.