ప్రభాస్​ ఫ్యాన్స్​ కు బిగ్​ అప్​డేట్.. సలార్​ దర్శకుడితో పౌరాణిక సినిమా

ప్రభాస్​ ఫ్యాన్స్​ కు బిగ్​ అప్​డేట్.. సలార్​ దర్శకుడితో పౌరాణిక సినిమా

డార్లింగ్​ అభిమానులకు పండగలాంటి వార్త వినిపించాడు నిర్మాత దిల్​ రాజు. దర్శకుడు ప్రశాంత్​ నీల్​తో ప్రభాస్​ ‘సలార్’​ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే కాకుండా వీరిద్దరూ కలిసి రెండో సినిమాను కూడా ప్లాన్​ చేశారు. ఈ విషయాన్ని తాజాగా దిల్​ రాజు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. త్వరలోనే ప్రశాంత్​తో ప్రభాస్​ ఓ పౌరాణిక సినిమాలో నటించనున్నాడని తెలిపాడు.

ఈ వార్త డార్లింగ్​ అభిమానుల్లో కొత్త జోష్​ను నింపుతోంది. ఇప్పటికే బాలీవుడ్​ దర్శకుడు ఓం రౌత్​తో ఆదిపురుష్​ లో ప్రభాస్​ నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరో పీరియాడికల్​ సినిమా అప్​డేట్​ ఇంట్రెస్టింగ్​ గా మారింది. సలార్​ తర్వాత ప్రశాంత్​ ఎన్టీఆర్​తో ఓ సినిమా చేయనున్నాడు. ఆ తర్వాతే ఈ సినిమా పట్టాలెక్కనున్నట్టు తెలుస్తోంది.