డ్రగ్స్ తీసుకుంటే ఇండస్ట్రీ నుంచి బహిష్కరిస్తాం..సెలబ్రిటీలకు దిల్ రాజు వార్నింగ్

డ్రగ్స్ తీసుకుంటే ఇండస్ట్రీ నుంచి బహిష్కరిస్తాం..సెలబ్రిటీలకు దిల్ రాజు వార్నింగ్

ఇక మీద ఎవారైనా డ్రగ్స్ తీసుకుంటే వారిని ఇండస్ట్రీ నుంచి బహిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు ఎఫ్ డీసీ ఛైర్మన్ దిల్ రాజు.  ఇప్పటికే మలయాళం ఫిలిం ఇండస్ట్రీలో డ్రగ్స్ తీసుకునే వారిని ఇండస్ట్రీ నుంచి  బహిష్కరిస్తున్నారని చెప్పారు. ఎఫ్ డీసీలో చర్చించి  ఇక్కడ కూడా త్వరలో  అలాంటి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు దిల్ రాజు.  సమాజంలో యాంటీ డ్రగ్స్ అవగాహన పై తన వంతు  ప్రచారం చేస్తానని  ప్రతిజ్ఞ చేశారు .

అలాంటి వారికి దూరంగా ఉండండి: విజయ్

మన చుట్టూ డ్రగ్స్  ట్రై చేయమనే బ్యాచ్ ఉంటుందని..అలాంటి వాళ్ల ఒత్తిడితో ఒక్కసారి అలవాటైతే  బయటకి రాలేమని అన్నారు హీరో విజయ్ దేవరకొండ. అలాటి వాళ్లకు దూరంగా ఉంటే మంచిదని  సూచించారు.  యూత్ డ్రగ్స్ కు దూరంగా ఉండాలని అన్నారు.  యంగ్ ఏజ్ లో చాలా కేర్ ఫుల్ గా ఉండాలని హెచ్చరించారు విజయ్. మన కంట్రీ పవర్.. స్టేట్ పవర్ మన  యూత్ అని.. యూత్ ను పాడు చేస్తే కంట్రీని నాశనం చేయవచ్చని ఇండియాలోకి డ్రగ్స్ పంపుతున్నారని అన్నారు. రాష్ట్ర లో డ్రగ్స్ పెరగకుండా ఉండటానికి ప్రతి ఒక్కరూ డ్రగ్స్ నిర్మూల పై అవగాహన పెంచాల్సి అవసరం ఉందన్నారు. అందరం రెస్పాన్సిబుల్ గా డ్రగ్స్ కు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. 

ALSO READ | రైజింగ్ తెలంగాణ స్ఫూర్తినిస్తోంది... డ్రగ్స్ నిర్ములనకు ప్రభుత్వ చర్యలు భేష్ : రామ్ చరణ్

హైదరాబాద్  శిల్పకళా వేదికలో  యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో జరుగుతున్న అంతర్జాతీయ యాంటీ డ్రగ్ , ఇల్లీగల్ ట్రాఫికింగ్ డే అవగాహన కార్యక్రమానికి  సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.   సినీ నటులు రామ్ చరణ్, విజయ దేవరకొండ , నిర్మాత దిల్ రాజ్,  ఎమ్మెల్యే అరికెపూడి  గాంధీ, చేవెళ్ల బీజేపీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి, పోలీస్ ఉన్నతాధికారులు హాజరయ్యారు.