
హైదరాబాద్ శిల్పకళా వేదికలో యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో జరుగుతున్న అంతర్జాతీయ యాంటీ డ్రగ్ , ఇల్లీగల్ ట్రాఫికింగ్ డే అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రైజింగ్ తెలంగాణ స్ఫూర్తిస్తోందని.. డ్రగ్స్ నిర్ములనలో తెలంగాణ ప్రభుత్వ చర్యలు బాగున్నాయని అన్నారు. కొన్ని సంవత్సరాల క్రితం స్కూల్స్ బయట డ్రగ్స్ అమ్ముతున్నారని విన్నానని.. 2014లో 3, 4 క్లాస్ చదివే పిల్లలకు ఐస్ క్రీంలలో డ్రగ్స్ ఇచ్చారని తెలిసి పేరెంట్స్ ధర్నాలు చేసిన విషయాన్ని గుర్తు చేసిన రామ్ చరణ్.. డ్రగ్స్ అంత డీప్ గా వెళ్లిపోయాయని అన్నారు.
ALSO READ | సినిమా రోల్ కాదు.. హీరోల రియల్ లైఫ్ను ఆదర్శంగా తీసుకోండి: సీఎం రేవంత్
ఫిజికల్ వర్క్ అవుట్, ఒక షూటింగ్, కుటుంబం తో క్వాలిటీ టైమ్, స్పోర్ట్స్.. ఒక రోజు కి ఇది చాలని అన్నారు. పిల్లలని స్కూల్స్ కు పంపాలంటే భయమేసే పరిస్థితులు ఉండకూడదని.. డ్రగ్స్ నిర్మూలన కు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు చాలా బావున్నాయని అన్నారు.ప్రభుత్వానికి ఇలాంటి మంచి కార్యక్రమంలో తమ తోడ్పాటు ఎప్పుడూ ఉంటుందని అన్నారు రామ్ చరణ్.
కుటుంబం తో గడపాలని.. హెల్త్ ను ఫిట్ గా ఉంచుకుంటూ మన కుటుంబాన్ని రక్షించుకోవాలని అన్నారు. మన సమాజాన్ని కాంపడల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు రామ్ చరణ్. తెలంగాణ ప్రభుత్వానికి, పోలీస్ డిపార్ట్ మెంట్ కి కృతఙ్ఞతలు తెలిపారు రామ్ చరణ్. ప్రతి ఒక్కరు సోల్జర్ గా మారి డ్రగ్స్ నిర్ములన కోసం పోరాడాలని అన్నారు. ఈ విధంగా అందరూ ప్రతిజ్ఞ తీసుకోవాలని పిలుపునిచ్చారు రామ్ చరణ్.