
హైదరాబాద్, వెలుగు: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) దినేశ్ పంత్ను మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ)గా ప్రమోట్ చేసింది. ఈ నెల 1 నుంచి ఆయన పదవీ కాలం మొదలైంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ను కేంద్ర ప్రభుత్వం కిందటి నెల 14న విడుదల చేసింది. దినేశ్ పంత్ ఇంతకు ముందు ఎల్ఐసీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (యాక్చురియల్– ఇన్సూరెన్స్ రిస్క్లను లెక్కించడం)గా పనిచేశారు.
ఇండియాలోని ప్రముఖ బ్రాంచ్లలో, ఓవర్సీస్లో ఎల్ఐసీ మార్కెటింగ్ ఆపరేషన్స్ను సక్సెస్ఫుల్గా లీడ్ చేశారు. యాక్చురియల్ పనులు చూసుకునే కొద్ది మంది ప్రొఫెషన్లలో దినేశ్ పంత్ ఒకరు. ఎల్ఐసీ ఐపీఓని 2022 లో సక్సెస్ఫుల్గా పూర్తి చేసిన మేనేజ్మెంట్ టీమ్లో ఆయన ఉన్నారు. 2002లో ఐఐఎంఏ ట్రైనింగ్ తర్వాత, ఎల్ఐసీలో పంత్ జాయిన్ అయ్యారు.