బాలీవుడ్ సినిమను రీమేక్ చేయనున్న హరీష్ శంకర్..?

బాలీవుడ్ సినిమను రీమేక్ చేయనున్న హరీష్ శంకర్..?

డైరెక్టర్ హరీష్ శంకర్ బాలీవుడ్ లో బంపర్ ఆఫర్ అందుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇతర భాషల్లో హిట్ అయిన సినిమాలను హరీష్ శంకర్ తెలుగు ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా రీమేక్ చేసి పలు హిట్లు కొట్టాడు. గబ్బర్ సింగ్, గద్దల కొండ గణేష్ సినిమాలు ఇతర ఇండస్ట్రీల నుంచి వచ్చినవే. లేటెస్ట్ గా హరీష్ ఓ బాలీవుడ్ సినిమాను రీమేక్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ హీరోగా నటించిన సినిమా రైడ్. కుమార్ మంగత్ పాఠక్ నిర్మించాడు. లక్నోలో 1980లో చోటు చేసుకున్న యదార్థ ఘటనలను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందించారు. రైడ్ ను తెలుగులో రీమేక్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీని హరీశ్ శంకర్ తెరకెక్కిచనున్నట్లు పుకార్లు షికార్లు కొడుతున్నాయి. తెలుగు వెర్షన్‌ను కుమార్ మంగత్ పాఠకే నిర్మించనున్నారట. కొన్ని రోజుల క్రితం ఈ సినిమాకు సంబంధించిన విషయాలపై చర్చించడానికే హరీష్ ముంబైకీ వచ్చినట్టు సమాచారం.

ప్రస్తుతం అజయ్ దేవగణ్ పాత్రకు ఎవరిని ఎంపిక చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయంపై పూర్తిగా  క్లారిటీ  రావాలంటే హరీష్ శంకర్ నుంచి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సిందే. ప్రస్తుతం హరీశ్ శంకర్ పవన్ హీరోగా భవదీయుడు భగత్ సింగ్ సినిమాను తెరకెక్కించనున్నాడు. ఈ తర్వాత రైడ్ రీమేక్‌ను పట్టాలెక్కించే అవకాశాలున్నాయట. బాలీవుడ్ లో రాజ్ కుమార్ గుప్తా తెరకెక్కించిన రైడ్ ను పనోరమా స్టూడియోస్‌తో కలసి టీ-సిరీస్ నిర్మించింది. సౌరబ్ శుక్లా, ఇలియానా కీలక పాత్రలు పోషించారు. షాక్ సినిమాతో డైరెక్టర్ గా మారిన హరీష్ శంకర్.. ఆ తర్వాత మిరపకాయ్, గబ్బర్ సింగ్, దువ్వాడ జగన్నాధం, గద్దలకొండ గణేష్ లాంటి సినిమాలను తెరకెక్కించిన విషయం తెలిసిందే.