‘సర్కిల్’ ఎమోషనల్ థ్రిల్లర్ : నీలకంఠ 

 ‘సర్కిల్’ ఎమోషనల్ థ్రిల్లర్ : నీలకంఠ 

షో, మిస్సమ్మ లాంటి చిత్రాలతో మెప్పించిన దర్శకుడు నీలకంఠ.. కొంత గ్యాప్ తర్వాత ‘సర్కిల్’ అనే చిత్రంతో వస్తున్నారు. సాయి రోనక్, బాబా భాస్కర్ లీడ్ రోల్స్‌‌లో నటించారు. ఈ మూవీ టీజర్‌‌‌‌ను ప్రసాద్‌‌ ల్యాబ్స్‌‌లో లాంచ్ చేశారు.  నీలకంఠ మాట్లాడుతూ ‘ఇదొక ఎమోషనల్ థ్రిల్లర్. ఓ ఫొటోగ్రాఫర్ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల కారణంగా అతను ఓ సర్కిల్‌‌లోకి లాగబడతాడు. ఎవరు స్నేహితుడు, ఎవరు శత్రువు అని తెలుసుకోలేని కన్‌‌ఫ్యూ జన్‌‌లో పడతాడు. ఆ సమస్య నుండి బయటకు రాగలిగాడా లేదా అనేది కథ’ అని చెప్పారు.

‘ఖైలాష్ అనే ఫోటోగ్రాఫర్ పాత్ర పోషించా. అతని జీవితంలోకి ఓ ప్రమాదకరమైన శత్రువు ప్రవేశిస్తే.. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా తెరకెక్కించారు’ అని సాయి రోనక్ చెప్పాడు. బాబా భాస్కర్ మాట్లాడుతూ ‘డిఫరెంట్ రోల్ ఇచ్చారు. ఇలాంటి పాత్రలో నటించగలనా లేదా అనే అనుమానం ఉండేది. నీలకంఠ గారు నా మీద నమ్మకం ఉంచి నేను నటించేలా చేశారు’ అని చెప్పాడు. మొదటి సినిమానే నీలకంఠ గారితో వర్క్​ చేయడం హ్యాపీ. కచ్చితంగా అందరికీ నచ్చుతుంది’ అని నిర్మాత శరత్ చంద్ర అన్నారు.