రామ్ చరణ్తో బాహుబలి రేంజ్ మూవీ.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

రామ్ చరణ్తో బాహుబలి రేంజ్ మూవీ.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

విశ్వంభర(Vishwambhara).. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ కళ్ళు మొత్తం ఈ సినిమాపైనే ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) హీరోగా దర్శకుడు వశిష్ట(Vassishta) తెరకెక్కిస్తున్న ఈ సినిమా అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు పెద్దగా అంచనాలు ఏర్పడలేదు కానీ, రీసెంట్ గా విడుదలైన ఈ సినిమా టైటిల్ వీడియోతో అంచనాలు భారీగా క్రియేట్ అవుతున్నాయి. సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ తో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక సంక్రాంతి కానుకగా విడుదలైన విశ్వంభర టైటిల్ వీడియో ఫుల్ వైరల్ అవగా.. దర్శకుడు వశిష్ట తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. 

ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ విశ్వంభర సినిమా గురించి, తన సినీ జర్నీ గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. బింబిసారా సినిమాతో కళ్యాణ్ రామ్ గారు నాకు లైఫ్ ఇచ్చారు. ఆ సినిమాకు సీక్వెల్ కూడా ఉంది. కానీ, అది నేను డైరెక్ట్ చేయడంలేదు. అయినప్పటికీ మా మధ్య ఎలాంటి సమస్యలు లేవు. ఇక విశ్వంభర సినిమా గురించి చెప్పాలంటే.. ఈ సినిమా కోసం ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేస్తున్నాం. ప్రేక్షకులకు ఈ సినిమా అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. ఇక విశ్వంభర తరువాత నేను రామ్ చరణ్ తో బాహుబలి లాంటి ఒక సినిమా చేస్తున్నాను అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ప్రస్తుతం నా ఫోకస్ అంతా విశ్వంభర పైనే. ఈ సినిమా కంప్లీట్ అయిన తరువాతనే నా తరువాతి సినిమా గురించి ఆలోచిస్తాను.. అని చెప్పుకోచ్చారు వశిష్ట.

ఇక విశ్వంభర సినిమా విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. యూవీ క్రియేషన్స్ సంస్థ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఛోటా కె నాయుడు కెమెరామెన్ గా చేస్తున్న ఈ సినిమాలో నటించబోయే హీరోయిన్ గురించి త్వరలోనే ప్రకటన రానుంది. భారీ అంచనాలున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకోనుందో చూడాలి.