క్రాక్ న్యూస్.. ఈసారి డబల్ ఇంపాక్ట్

క్రాక్ న్యూస్.. ఈసారి డబల్ ఇంపాక్ట్

మాస్ మహారాజ రవితేజ హీరోగా వచ్చిన క్రాక్ మూవీ ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పటివరకు వరుస ఫ్లాప్స్ తో ఉన్న రవితేజకు పూర్వ వైభవాన్ని తెచ్చిపెట్టింది ఈ సినిమా. గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ సినిమా మాస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అయితే క్రాక్ సినిమా రిలీజ్ టైంలోనే సీక్వెల్ కూడా ఉంటుందని ప్రకటించాడు డైరెక్టర్ గోపీచంద్ మలినేని. 

ఇప్పుడు అదే ప్లాన్ లో ఉన్నాడట ఈ డైరెక్టర్. రీసెంట్ గా బాలయ్యతో వీరసింహా రెడ్డి సినిమా తీసి కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్న ఈ డైరెక్టర్.. క్రాక్ 2కి సంబందించిన కథని కూడా సిద్ధం చేసాడట. ఫైనల్ స్క్రిప్ట్ తో ఫుల్ సాటిస్ఫై అయిన రవితేజ ఈ ప్రాజెక్ట్ కోసం వెంటనే ఒకే చెప్పేశాడట. ఇక గోపీచంద్ మలినేని తో వీరసింహా రెడ్డి సినిమాను తెరకెక్కించిన మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనున్నారని సమాచారం. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన మిగతా వివరాలు త్వరలోనే బయటకు వచ్చే అవకాశం ఉంది. 

రవితేజ ప్రస్తుతం టైగర్ నాగేశ్వర రావు సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీ గా ఉన్నాడు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.