5వేల మంది దివ్యాంగుల యోగా...

5వేల మంది దివ్యాంగుల యోగా...

రంగారెడ్డి జిల్లాలో యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నందిగామ మండలం కన్హా శాంతి వనంలో 5 వేల మంది దివ్యాంగులతో యోగా దినోత్సవాన్ని కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 5 వేల మంది దివ్యాంగులు వరుస క్రమంలో నిల్చుని యోగాసనాలు వేశారు. 

రికార్డ్స్..

ఎక్కువ మంది దివ్యాంగులు ఒకే దగ్గర యోగా చేసినందుకు ఈ కార్యక్రమం పలు రికార్డుల్లో చోటు దక్కించుకుంది. ఆసియా బుక్ రికార్డ్, వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డలకెక్కింది. ఈ సందర్భంగా  యోగా దినోత్సవంలో పాల్గొన్న దివ్యాంగులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కేంద్ర మంత్రి విరేంద్ర కుమార్, కేంద్ర సహాయ మంత్రి నారాయణ స్వామి హాజరయ్యారు.