దివ్యాంగులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి : సుజాత సూర్యవంశీ

దివ్యాంగులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి : సుజాత సూర్యవంశీ

బోధన్, వెలుగు: ఎన్నికల సమయంలో సీఎం రేవంత్​రెడ్డి దివ్యాంగులు, ఫించన్​దారులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి సుజాత సూర్యవంశీ డిమాండ్​చేశారు. గురువారం బోధన్​లో ప్రెస్​మీట్ నిర్వహించి మాట్లాడారు. దివ్యాంగులకు నెలకు రూ.6 వేలు, ఫించన్​దారులకు రూ.4 వేల ఇస్తామని సీఎం రేవంత్​రెడ్డి హామీ ఇచ్చారని గుర్తుచేశారు. 

కాంగ్రెస్​ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేడ్లు పూర్తవుతున్నా నేటికీ ఫించన్లు పెంచలేదన్నారు. ఇప్పటికైనా ఇచ్చిన హామీ ప్రకారం ఫించన్లు అందించాలని డిమాండ్​చేశారు. కార్యక్రమంలో ఎంఆర్​పీయస్, ఎంఎస్​పీ నాయకులు గుమ్ముట్టు పద్మ, లక్ష్మిగారి భూమయ్య, బండారి పోశేట్టి, తాడెం అబ్బయ్య, రవి కుమార్​, శేఖర్​ తదితరులు పాల్గోన్నారు.