పిల్లలతో సహా తల్లి అదృశ్యం

పిల్లలతో సహా తల్లి అదృశ్యం

పటాన్​చెరు(గుమ్మడిదల), వెలుగు: ఇద్దరు పిల్లలతో సహా తల్లి కనిపించకుండా పోయిన ఘటన సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల పీఎస్ ​పరిధిలో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్​కు చెందిన కస్తూర్​రామ్​8 ఏళ్ల క్రితం దోమడుగు గ్రామానికి వచ్చి వినాయక విగ్రహాలు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతడి మూడో కూతురు సంగీతను కొన్నేళ్ల క్రితం కాలురాం కు ఇచ్చి పెళ్లి చేశాడు.

వారికి 9 సంవత్సరాల పాప, 12 సంవత్సరాల బాబు ఉన్నారు. రెండు నెలల క్రితం కూతురును విడిచి పెట్టి అల్లుడు వెళ్లిపోయాడు. ఈ నెల 16న రాత్రి నుంచి  కూతురు సంగీత, మనువడు ప్రవీన్​, మనువరాళు సుందరి కనిపించడంలేదు. చుట్టు పక్కల, బంధువుల దగ్గర వెతికినా ఆచూకీ దొరకలేదు. దీంతో పీఎస్​లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.