
న్యూఢిల్లీ : ప్రొ పంజా లీగ్ (ఆర్మ్ రెజ్లింగ్) తొలి మ్యాచ్లో కిరాక్ హైదరాబాద్కు నిరాశ ఎదురైంది. శుక్రవారం ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో లుథియానా లయన్స్తో జరిగిన పోరులో అండర్ కార్డు మ్యాచ్ల్లో మూడింటా పరాజయాలు చవిచూసిన హైదరాబాద్.. మెయిన్ కార్డు మ్యాచ్లో మెప్పించింది. హైదరాబాద్ ఆర్మ్ రెజ్లర్ అక్సర్ అలీ 3–1తో తేజాస్పై ఈజీగా నెగ్గాడు. కానీ స్టీవ్ థామస్, షోయబ్ అక్తర్ తమ మ్యాచ్ల్లో1–2తో ఓటమిపాలయ్యారు. ఆదివారం జరిగే రెండో మ్యాచ్లో హైదరాబాద్.. బరోడా బాద్షాస్తో పోటీపడుతుంది. తొలి సీజన్ పోటీలను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అధికారికంగా ప్రారంభించారు.