కరోనా కష్టకాలంలో ఆక్సిజన్​ కాన్సెంట్రేటర్లను అందిస్తోన్న కాకా ఫౌండేషన్

కరోనా కష్టకాలంలో ఆక్సిజన్​ కాన్సెంట్రేటర్లను అందిస్తోన్న కాకా ఫౌండేషన్

కరోనా కష్టకాలంలో ఆక్సిజన్​ కాన్సెంట్రేటర్లు అందించి పేషెంట్లకు అండగా నిలుస్తుంది కాకా వెంకటస్వామి ఫౌండేషన్. కరోనా పేషెంట్లు ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోతున్న విపత్కర పరిస్థితుల్లో వారికి తమవంతు సాయంగా ఆక్సిజన్​ కాన్సెంట్రేటర్లు అందించాలని మాజీ ఎంపీ, బీజేపీ స్టేట్​ కోర్​ కమిటీ మెంబర్​ వివేక్​ వెంకటస్వామి మంచి నిర్ణయం తీసుకున్నార‌ని తెలిపారు మంచిర్యాల ఏరియా హాస్పిట‌ల్ డాక్ట‌ర్లు. పెద్దపల్లి పార్లమెంట్​ సెగ్మెంట్​ పరిధిలోని మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్​, పెద్దపల్లి, సుల్తానాబాద్​, ధర్మపురి గవర్నమెంట్​ హాస్పిటల్స్​కు వీటిని అందిస్తున్నారు. పది లీట‌ర్ల కెపాసిటీ గల ఒక్కో పరికరం విలువ లక్ష రూపాయలు ఉంటుందని ఫౌండేషన్​ సభ్యులు తెలిపారు. శ‌నివారం మంచిర్యాల ఏరియా ఆసుపత్రిలో సూపరింటెండెంట్​ డాక్టర్​ అరవింద్ కు కాకా ఫౌండేషన్ ప్రతినిధులు ఆక్సిజన్​ కాన్సెంట్రేటర్ అందజేశారు.  

గతేడాది కరోనా లాక్​డౌన్​ టైమ్​లో కాకా వెంకటస్వామి ఫౌండేషన్​ ఆధ్వర్యంలో డాక్టర్​ వివేక్​ వెంకటస్వామి పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేసిన విష‌యం తెలిసిందే. ఈ సంవత్సరం కరోనా సెకండ్​ వేవ్​తో ఆక్సిజన్​ అందక చాలామంది పేషెంట్లు అవస్థలు పడుతున్న క్ర‌మంలో వివేక్ వెంకటస్వామి ఆక్సిజన్​ కాన్సెంట్రేటర్లు అందజేయడం అభినందనీయమని జిల్లా ప్ర‌జ‌లు అంటున్నారు. 

ఆక్సిజన్​ కాన్సెంట్రేటర్లు ఎంతో ఉపయోగం

కరోనా చికిత్సలో ఆక్సిజన్​ కాన్సెంట్రేటర్లు ఎంతో ఉపయోగపడుతాయి. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కాకా వెంకటస్వామి ఫౌండేషన్​ ద్వారా చెన్నూర్​ హాస్పిటల్​కు రూ.లక్ష విలువైన ఆక్సిజన్​ కాన్సెంట్రేటర్​ను డొనేట్​ చేశారు. ఇందుకు ఫౌండేషన్​ చైర్మన్​ డాక్టర్​ వివేక్​ వెంకటస్వామికి వైద్య ఆరోగ్యశాఖ తరపున డా. అరవింద్  ధన్యవాదాలు తెలిపారు.