కరోనా కష్టకాలంలో పేషెంట్లకు కాకా వెంకటస్వామి ఫౌండేషన్ అండగా నిలుస్తోంది. సర్కారు హాస్పిటల్స్లో ఆక్సిజన్ కొరతతో పేషెంట్లు అవస్థలు పడుతున్న నేపధ్యంలో కాకా ఫౌండేషన్ ప్రతినిధులు ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు అందించడానికి ముందుకొస్తున్నారు.
మంచిర్యాల జిల్లా చెన్నూర్ గవర్నమెంట్ హెల్త్ సెంటర్కు ‘కాకా ఫౌండేషన్’ ఆధ్వర్యంలో లక్ష రూపాయల విలువ చేసే ఆక్సిజన్ కాన్సంట్రేటర్ను ఫౌండేషన్ తరుపున బీజేపీ నాయకులు అందుగుల శ్రీనివాస్, మద్ది శంకర్, వెంకటేశ్వర్ గౌడ్ అందజేశారు. అదేవిధంగా సుల్తానాబాద్ ఐసోలేషన్ సెంటర్కి కూడా లక్ష రూపాయల విలువ చేసే ఆక్సిజన్ కాన్సెంట్రర్ను ‘కాకా ఫౌండేషన్’ ఆధ్వర్యంలో ఫౌండేషన్ ప్రతినిధులు అందజేశారు.
గతేడాది లాక్డౌన్ టైమ్లో కూడా కాకా వెంకటస్వామి ఫౌండేషన్ ద్వారా పేదలకు నిత్యావసరాల కిట్లు, ప్రభుత్వ వైద్యసిబ్బందికి పీపీఈ కిట్లు పంపిణీ చేసి వివేక్ వెంకటస్వామి తన పెద్దమనను చాటుకున్నారు.