
నవీపేట్, వెలుగు : రామనవమి సందర్భంగా మండంలోని పలు గ్రామాల్లో బీజేపీ మండల అధ్యక్షుడు కాషాయ జెండాలు, పూజ సామగ్రి పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అయ్యోధ్య లో రామ మందిరం నిర్మాణం తర్వాత ప్రపంచం వ్యాప్తంగా వేడుకలను ఘనంగా నిర్వహించుకోబోతున్నామన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు భూషణ్, రాజేందర్ గౌడ్, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.