కేంద్రంపై నిందలు వేస్తూ పబ్బం గడుపుతున్న కేసీర్ కు రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని బీజేపీ లీడర్ డీకే అరుణ అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయం, టీఆర్ఎస్ చేస్తున్న మోసాన్ని బీజేపీ కార్యకర్తలు ప్రజలలోకి తీసుకెళ్లాలని ఆమె పిలుపునిచ్చారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో జరుగుతున్న బీజేపీ కార్యకర్తల శిక్షణా తరగతులకు హాజరైన ఆమె పైవ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్ ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్లు దుర్వినియోగం చేస్తూ.. రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చాడని ఆమె అన్నారు. కేసీఆర్ కుటుంబం కోట్ల ఆస్తులు సంపాదించుకొని తమ జేబులు నింపుకుంటున్నారని అరుణ వ్యాఖ్యానించారు. హుజురాబాద్ తీర్పును జీర్ణించుకోలేక.. ఏమీ చేయలేని పరిస్థితిలో కేసీఆర్ పిచ్చెక్కి మాట్లాడుతున్నారని ఆమె అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టీఆర్ఎస్ పార్టీని ప్రజలు బొంద పెడతారని డీకే అరుణ అన్నారు.
నిర్మల్ జిల్లా ఖానపూర్ పట్టణంలో బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశంలో పాల్గొని ప్రసంగించడం జరిగింది.
— D K Aruna (@aruna_dk) December 7, 2021
? @narendramodi గారి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాల్సిన బాధ్యత మనది.
? తెలంగాణలో రోజు రోజుకు కమలం వికసిస్తుంది. బలమైన శక్తిగా ఎదుగుతుంది. pic.twitter.com/n0pzvlvNxH