కల్వకుంట్ల కుటుంబం పతనం మొదలైంది

కల్వకుంట్ల కుటుంబం పతనం  మొదలైంది

రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబం పతనం ప్రారంభమైందన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. కేసీఆర్ కు ప్రజలు చరమ గీతం పాడుతారన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా దీక్ష చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై పోలీసులు అక్రమ కేసులు పెట్టి రిమాండ్ కు తరలించడం సిగ్గు మాలిన చర్య అని అన్నారు. కరోనా నిబంధనలు కేవలం బీజేపీకి మాత్రమే వర్తిస్తాయా? టీఆర్ఎస్ బహిరంగ సభలు ,సమావేశాలు పెట్టినప్పుడు ఏ నిబంధనలు గుర్తు రాలేదా అని ప్రశ్నించారు. పోలీసులు కండువా వేసుకొని టీఆర్ఎస్ కార్యకర్తల్ల వ్యవహరిస్తున్నారన్నారు. కేసీఆర్ నియంత వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని, వారిని పాతాళానికి తొక్కెందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.లు చెరిగారు. అరెస్టులు కేసులతో భయపడే ప్రసక్తే లేదని, ప్రజల శ్రేయస్సు కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమన్నారు డీకే అరుణ.