ఖమ్మం మెడికల్ కాలేజీ, హాస్పిటల్స్ తనిఖీ

ఖమ్మం మెడికల్ కాలేజీ, హాస్పిటల్స్ తనిఖీ

ఖమ్మం టౌన్, వెలుగు: ఖమ్మం మెడికల్ కాలేజీ, జనరల్ హాస్పిటల్, ఎంసీహెచ్ లో డీఎంఈ డాక్టర్ నరేందర్, గాంధీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఇందిర బృందం గురువారం తనిఖీ చేశారు. సౌకర్యాలపై ఆరా తీశారు. ఓపీ విభాగం, రక్త పరీక్షలు, పెషెంట్లకు అందుతున్న వైద్య సేవల వివరాలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్, కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.రాజేశ్వరరావు ఆధ్వర్యంలో అడిషనల్ కలెక్టర్ పి.శ్రీజతో కలిసి ఆస్పత్రిలో పర్యవేక్షణపై సమీక్ష నిర్వహించారు.

మెడికల్ కాలేజ్ నిర్వహణపై వారు సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. జీజీహెచ్ లో పరికరాల కొరతపై సూపరింటెండెంట్​లెటర్ అందించనట్లు సమాచారం. కాగా జీజీహెచ్ వైద్య విభాగాల్లో గతంలో ఎన్నడూ లేనంత మంది సీనియర్​డాక్టర్లు కనిపించడం గమనార్హం.  డీఎంహెచ్​వో కళావతి బాయి, మెడికల్ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ సృజన, జీజీహెచ్ డిప్యూటీ సూపరింటెండెంట్ కిరణ్ కుమార్, ఎంసీహెచ్ ఆర్ఎంవో రాంబాబు తదితరులున్నారు.