
కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్ జిల్లాలో రూల్స్కు విరుద్ధంగా నిర్వహిస్తున్న 5 స్కానింగ్ సెంటర్లకు నోటీసులు ఇచ్చినట్లు డీఎంహెచ్వో వెంకటరమణ తెలిపారు. గురువారం సిటీలోని డీఎంహెచ్వో ఆఫీస్లో లింగ నిర్ధారణ నిషేధ చట్టంపై జిల్లా అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లాలో లింగ నిర్ధారణ నిషేధ చట్టం అమలు తీరును సమీక్షించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్వో మాట్లాడుతూ పీసీ, పీఎన్డీటి చట్టంలోని రూల్స్ పాటించని స్కానింగ్ సెంటర్లకు నోటీసులు ఇచ్చామని, మార్పు రాకపోతే సీజ్ చేస్తామని హెచ్చరించారు.
లింగ నిర్ధారణ పరీక్షలు చేసిన వారికి 3 ఏండ్ల జైలు శిక్షతో పాటు రూ.10వేల జరిమానా విధిస్తామన్నారు. కార్యక్రమంలో పీవోడీటీ డాక్టర్ ఉమాశ్రీ, పీవో, పీసీ అండ్ పీఏన్డీటీ డా.సనా జవేరియా, డెమో రాజగోపాల్, హెల్త్ ఎడ్యుకేటర్ కైక, సూపర్వైజర్ సయీద్ సాబీర్, పాల్గొన్నారు.